“బంజార” – ఇక్బాల్ చంద్ కవిత్వం

వ్యాసం రాసిపంపినవారు: బుడుగోయ్
ఈమాటలో అడపాదడపా చక్కని కవితలు రాసే కవి మూలా సుబ్రహ్మణ్యం పుస్తకం.నెట్లో రాసిన వ్యాసం చూసి  ఇక్బాల్ చంద్ కవిత్వం చదవాలన్న కుతూహలం కలిగింది.
ఆ వ్యాసంలో నన్నాకర్షించిన వాక్యం
“ఇక్బాల్‌చంద్‌ తన అస్తిత్వ వేదన నీ, ఆత్మలోకంలో దివాలానీ, అంతుపట్టని అన్వేషణనీ అద్భుతంగా ఆవిష్కరించారు తన ‘ఆరోవర్ణం’ కవితా సంకలనంలో…
నవీన జీవితంలోని అత్యంత సూక్ష్మమైన ప్రశ్నలకి ప్రతినిధిగా కనిపించే మహాకవి బైరాగి తన అస్తిత్వ వేదనని గానం చేసేందుకు శబ్ద కవిత్వాన్నే వాహకంగా వాడుకున్నాడు. ఆయన కవిత్వంలో నిశ్శబ్ద పద చిత్రాలు ఎక్కడా కనిపించవు. అయితే నిశ్శబ్ద పద చిత్రాలతో సైతం ఆ ఆవేదనని అంతే గాఢంగా ఆలపించొచ్చు అని నిరూపించాడు ఇక్బాల్‌చంద్‌.”

ఆరోవర్ణమంటూ కాస్త నెట్లో వెతికితే, గత దశాబ్ద కాలంలో ఎన్నదగ్గ విమర్శ రాసిన తమ్మినేని యదుకుల భూషణ్ వ్యాసం కనిపించింది.
“ఇక్బాల్‌ చంద్‌ కవిత్వంలో …

పూర్తిగా చదవండి »

కవితలు, తెలుగు, పతాక శీర్షిక, విశేష రచనలు, సమీక్షలు - అభిప్రాయాలు »

వ్యాసం రాసిపంపినవారు: బుడుగోయ్
ఈమాటలో అడపాదడపా చక్కని కవితలు రాసే కవి మూలా సుబ్రహ్మణ్యం పుస్తకం.నెట్లో రాసిన వ్యాసం చూసి  ఇక్బాల్ చంద్ కవిత్వం చదవాలన్న కుతూహలం కలిగింది.
ఆ వ్యాసంలో నన్నాకర్షించిన వాక్యం
“ఇక్బాల్‌చంద్‌ తన అస్తిత్వ వేదన నీ, ఆత్మలోకంలో దివాలానీ, అంతుపట్టని అన్వేషణనీ అద్భుతంగా ఆవిష్కరించారు తన ‘ఆరోవర్ణం’ కవితా సంకలనంలో…
నవీన జీవితంలోని అత్యంత సూక్ష్మమైన ప్రశ్నలకి ప్రతినిధిగా కనిపించే మహాకవి బైరాగి తన అస్తిత్వ వేదనని గానం చేసేందుకు శబ్ద కవిత్వాన్నే వాహకంగా వాడుకున్నాడు. ఆయన కవిత్వంలో నిశ్శబ్ద పద చిత్రాలు ఎక్కడా కనిపించవు. అయితే నిశ్శబ్ద పద చిత్రాలతో సైతం ఆ ఆవేదనని అంతే గాఢంగా ఆలపించొచ్చు అని నిరూపించాడు ఇక్బాల్‌చంద్‌.”

ఆరోవర్ణమంటూ కాస్త నెట్లో వెతికితే, గత దశాబ్ద కాలంలో ఎన్నదగ్గ విమర్శ రాసిన తమ్మినేని యదుకుల భూషణ్ వ్యాసం కనిపించింది.
“ఇక్బాల్‌ చంద్‌ కవిత్వంలో …

Interviews, అనువాదాలు, కవితలు, తెలుగు, పతాక శీర్షిక »

[ సౌమ్య | 12 Mar 2010 | 6 వ్యాఖ్యలు | 260 views]

తెలుగు కవిత్వాన్ని అసామీస్ భాషలోకి అనువదిస్తున్న గరికపాటి పవన్ కుమార్-సంగీత దంపతులతో జరిపిన ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇది. ఈ ప్రయత్నంలో సహకరించిన పవన్-సంగీత గార్లకు, వీరి కృషి గురించి తెలియజేసిన తమ్మినేని యదుకులభూషణ్ గారికి ధన్యవాదాలు. ప్రశ్నలు కూర్చడంలో తోడ్పడిన స్వాతి, మోహన లకు ప్రత్యేక ధన్యవాదాలు – సౌమ్య,పూర్ణిమ

ఇక చదవండి:
మీ ఇద్దరి గురించి ఓ చిన్న పరిచయం…
గరికపాటి సంగీత:
జోర్హాతు, అస్సాంలో జననం. ఫిలాసఫీలో ఉన్నతవిద్య.సంగీతం తన ప్రాణం. హిందుస్తానీ సంగీతంలో పదేళ్ళకు పైగా కృషి, సంగీతంలో పట్టభద్రురాలు.
రెండు బిహూ పాటల కాసెట్లు వెలువడ్డాయి. అస్సామీ బిహూ నృత్యం వచ్చు. తెలుగు చదవడం, రాయడం పిల్లలకోసమని నేర్చుకుంది.
గరికపాటి పవన్ కుమార్:
ఖమ్మంలో బాల్యం.విజయవాడ సిద్ధార్థా ఇంజనీరింగ్ కాలేజిలో విద్యాభ్యాసం (తమ్మినేని యదుకుల భూషణ్ తో సాహచర్యం). రాంచీలో M. Tech. చెన్నయ్ లో మరో P.G., ఉద్యోగ …

కవితలు, తెలుగు, పతాక శీర్షిక, పుస్తక పరిచయాలు, సమీక్షలు - అభిప్రాయాలు »

[ అతిథి | 11 Mar 2010 | 2 వ్యాఖ్యలు | 206 views]

వ్యాసం రాసిన వారు: మూలా సుబ్రమణ్యం
[ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో 2006 లో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు - పుస్తకం.నెట్ బృందం.]
ప్రపంచ సాహిత్యాన్ని ఎంత చదివినా దాహం తీరదు.చదివే ప్రతి పుస్తకం హృదయానికున్న వేల కిటికీల్లో ఒక కొత్త కిటికీ ని తెరుస్తుంది.ఆ తెరిచిన కిటికీ మేరకు మన హృదయం లోనికి కాంతి ప్రవేశిస్తుంది.అందుకే ఒక మంచి పుస్తకం చదివితే కలిగే అనుభూతి ని మాటల్లో వ్యక్తీకరించడం సాధ్యం కాదు.అలా ఈ మధ్య నేను చదివిన శ్రీ విన్నకోట రవిశంకర్‌ గారి కవితా సంకలనం ‘వేసవి వాన’ పై ఒక సమీక్ష.
కవిత్వమంటే ఏమిటి? ప్రతి యుగం లోనూ ప్రతి కవీ ఈ ప్రశ్న వేసుకుంటునే ఉన్నాడు.కవిత్వం ఎందుకు? ఎవరికోసం? ఈ ప్రశ్నలు తమని వేధించకుండా ఏ కవీ మౌలికమైన తన …

General, News, పతాక శీర్షిక, రచయిత(త్రు)లు »

ఘాటైన వచనంతో తెలుగు సాహిత్యంలో తనదైన స్థానం సంపాదించుకున్న కేఎన్ వై పతంజలి మరణించి రేపటికి (మార్చి 11) ఏడాది.
ఈ సందర్భంగా సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం ఐదు గంటలకు పతంజలిని తలచుకునే కార్యక్రమం ఏర్పాటు చేశాం.
పతంజలి గురించి నాలుగు ముక్కలు మాట్లాడాలనుకునేవారూ, ఇతరులు మాట్లాడితే విందామనుకునేవారూ, మౌనంగానయినా ఒకసారి తల్చుకుందామనుకునేవారూ తప్పక రండి.
ఇట్లు
పతంజలి మిత్రులు.

ఇంగ్లీషు, ఇతర భాషలు, పతాక శీర్షిక, పుస్తక పరిచయం, విశేష రచనలు »

వ్యాసం రాసిపంపిన వారు: దైవానిక
ఫాంటసి కథలు ఇష్టపడే వారికి, ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా సాగే Wheel of Time సీరీస్ ని పరిచయం చేయడం నిజంగా అదృష్టమే. ఈ సీరీస్ ని  రాబర్ట్ జోర్డన్ అనే కలంపేరుతో , జేమ్స్ ఆలివ్ రిగ్ని జూ. (James Oliver Rigney, Jr.) రచించారు. దీనిగురించి మరింత చెప్పేముందు సీరిస్ కి సంబంధించి కొన్ని నిజాలు చెప్పాలి.
1. ఈ సీరీస్ ఇంకా పూర్తి కాలేదు. మొదటి పుస్తకం 1990లో వచ్చింది. ఇప్పటికి 12 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 2 రావాల్సి ఉన్నాయి.
2. రాబర్ట్ జోర్డన్ గారు సీరీస్ ముగించకుండానే కన్నుమూసారు. ఆయన కథంతా చనిపోయే ముందు రికార్డ్ చేసారు. ఇప్పుడు ఆ కథని బ్రాండన్ సాండర్సన్ కొనసాగిస్తున్నారు. బ్రాండన్ ఆధ్వర్యంలోనే 12వ పుస్తకం వచ్చింది.
ప్రపంచంలోనే ఎందరో ఫాన్స్ ని సంపాదించిన …