మణిదీపాలు

వంద నీతులు చెబితే ఎవరూ వినరు. ఒక్క ఉదాహరణ చూపిస్తే అందఱికీ నమ్మ బుద్ధేస్తుంది. ఈ సత్యాన్ని మన పూర్వీకులు బాగానే ఆకళించుకున్నారు. అందుకనే ప్రపంచంలో ఎక్కడా లేనంత కథాసాహిత్యం భారతదేశంలో పోగుపడింది. మన ౧౮ పురాణాలూ, ౧౮ ఉపపురాణాలూ, ఇతిహాసాలూ, కథాసరిత్సాగరం, పంచతంత్రం అన్నీ కథామయం. ఇతరుల్ని ఒప్పించడంలో దృష్టాంతానికున్న ప్రాధాన్యాన్ని గమనించినవారు కనుకనే కథనీ, కవిత్వాన్నీ వేఱుచేసి చూడడానికి మన పూర్వీకులు అంగీకరించలేదు. వారు కథల్ని ఆలంబనగా చేసుకొని వాటి చుట్టూ రసమయ కావ్యాల్ని అల్లారు. ముఖ్యంగా పిల్లలకు కథలే మెదడుకు మేత. కథాశ్రవణం బాల్యానికి అద్దిన ఆజీవన పరిమళం. అలాగే అవంటే చెవి కోసుకునే పెద్దలకూ కొదవలేదు. “నాకో కథ చెప్పవూ ?” అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాల మౌనఘోష.
పిల్లల్ని క్షణికంగా వినోదింపజేయడమే కాక వారి భావినైతిక జీవనాన్ని సైతం తీర్చిదిద్దాలంటే కల్పిత …

పూర్తిగా చదవండి »

తెలుగు, పతాక శీర్షిక, బాలసాహిత్యం, విశేష రచనలు, సమీక్షలు - అభిప్రాయాలు »

వంద నీతులు చెబితే ఎవరూ వినరు. ఒక్క ఉదాహరణ చూపిస్తే అందఱికీ నమ్మ బుద్ధేస్తుంది. ఈ సత్యాన్ని మన పూర్వీకులు బాగానే ఆకళించుకున్నారు. అందుకనే ప్రపంచంలో ఎక్కడా లేనంత కథాసాహిత్యం భారతదేశంలో పోగుపడింది. మన ౧౮ పురాణాలూ, ౧౮ ఉపపురాణాలూ, ఇతిహాసాలూ, కథాసరిత్సాగరం, పంచతంత్రం అన్నీ కథామయం. ఇతరుల్ని ఒప్పించడంలో దృష్టాంతానికున్న ప్రాధాన్యాన్ని గమనించినవారు కనుకనే కథనీ, కవిత్వాన్నీ వేఱుచేసి చూడడానికి మన పూర్వీకులు అంగీకరించలేదు. వారు కథల్ని ఆలంబనగా చేసుకొని వాటి చుట్టూ రసమయ కావ్యాల్ని అల్లారు. ముఖ్యంగా పిల్లలకు కథలే మెదడుకు మేత. కథాశ్రవణం బాల్యానికి అద్దిన ఆజీవన పరిమళం. అలాగే అవంటే చెవి కోసుకునే పెద్దలకూ కొదవలేదు. “నాకో కథ చెప్పవూ ?” అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాల మౌనఘోష.
పిల్లల్ని క్షణికంగా వినోదింపజేయడమే కాక వారి భావినైతిక జీవనాన్ని సైతం తీర్చిదిద్దాలంటే కల్పిత …

తెలుగు, నవలలు, పతాక శీర్షిక, సమీక్షలు - అభిప్రాయాలు »

[ అతిథి | 30 Aug 2010 | ఒక వ్యాఖ్య | 215 views]

రాసిన వారు: ఎమ్బీయస్ ప్రసాద్
(ఈ వ్యాసం మొదట జులై 2010 ’ఈభూమి’ పత్రికలో ప్రచురితమైనది.)
******************
మనకు పురాణాలలో లభించేదంతా అక్షరసత్యాలు కానక్కరలేదు. పురాణం అంటే జనశ్రుతంగా వస్తున్న కథ. మనిషి బతికుండగానే ఎన్నెన్ని అతిశయోక్తులు పుడుతున్నాయో, కళ్ళెదురుగుండా జరిగే సంఘటనకే టీవీ ఛానెల్సు వేర్వేరు తరహాలుగా ఎలా వ్యాఖ్యానాలు చెపుతున్నాయో చూస్తున్నాం. వేల ఏళ్ళ క్రితం గ్రంథస్తం అయిన గాథల్లో కూడా ఇలాటివి చోటు చేసుకోవచ్చని సులభంగా వూహించవచ్చు. అలా గ్రంథస్తం అయినవి ఇన్ని తరాలూ దాటుకుని ఉన్నదున్నట్టుగా దిగుమతి అయ్యాయని అనుకోవడానికి వీలు లేదు. మహాభారతం తన మూలరూపానికి ఆరురెట్లు పెరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆ పులుసులో ఎవరికి కావలసిన దినుసులు వాళ్ళు పడేశారని.
ఇలా తయారైన పులుసును కూడా రకరకాలైన దృష్టికోణాలతో చూశారు మనవాళ్ళు. వ్యాసుడు చెప్పలేదు కానీ, ఇలా జరిగిఉంటుంది అనుకుని వూహించి కొంత కల్పన …

Book Launch, News, కన్నడ, పతాక శీర్షిక »

[ సౌమ్య | 29 Aug 2010 | 3 వ్యాఖ్యలు | 114 views]

కన్నడ పుస్తక ప్రపంచంలో విశిష్టమైన ఉదంతంగా వర్ణిస్తున్న – సంధ్యా పాయ్ గారి పదిహేను పుస్తకాల ఆవిష్కరణ తాలూకా ఆహ్వాన పత్రం ఈ టపాతో జతచేస్తున్నాము. ఆహ్వానం అంతా కన్నడలో ఉంది…. కనుక, అసలు విషయం ఏమిటంటే –
’స్నేహా బుక్ హౌస్’, బెంగళూరు వారు ప్రచురించిన 15 పుస్తకాల ఆవిష్కరణ సభ రవీంద్ర కళాక్షేత్ర లో రాబోయే శుక్రవారం (సెప్టెంబర్ మూడు, 2010) న సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య జరగనుంది. ఈ పుస్తకాలను రాసినది సంధ్యా పాయ్ (ప్రముఖ కన్నడ వారపత్రిక ’తరంగ’ నిర్వాహకురాలు, మణిపాల్ గ్రూపు యజమానురాలు) . కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి – డాక్టర్ వి.ఎస్.ఆచార్య సభకు అధ్యక్షత వహిస్తారు.

ఇక – ఈ ఇన్విటేషన్ ఇక్కడ వేయడం వెనుక కథ:
ఒక వర్షాకాలపు సాయంత్రం బెంగళూరులోని శ్రీనగర్ …

General, News, పతాక శీర్షిక »

అగస్టు 29, తెలుగుభాషాదినోత్సవం రోజున తెలుగుభాషకోసం అందరం కలిసి నడుద్దాం. మీరు తప్పకరండి అందరికీ తెలియజేయండి. వివరాలకోసం ఇక్కడ చూడండి -

(మురళీధర్ నామాల గారి మాటల్లో)
తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి “లెస్స”యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.
ఇది నిన్న మొన్నొచ్చిన నడమంత్రపు సిరికాదు, తరతరాల వారసత్వంగా మనకొచ్చిన సంపద. వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రం భద్రపరచుకుని, భాషాసంపదను మాత్రం గాలికి వదిలేశాం. భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో అధికారంకోసం కొట్టుకు చస్తూ, అందినది అందినట్టు దోచుకు తింటున్న మన నాయకులు భాషకి ఏనాడో తిలోదకాలిచ్చేసారు.అమ్మని “అమ్మా” అని పరిచయం చేసిన …

తెలుగు, పతాక శీర్షిక, పుస్తక పరిచయం, రచయిత(త్రు)లు, విశేష రచనలు, స్వీయకథనాలు »

[ అతిథి | 28 Aug 2010 | 7 వ్యాఖ్యలు | 417 views]

రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న
*****************
ఇప్పటి దాకా ఈ పుస్తకం పై పుస్తకం.నెట్‌లో సమీక్ష రాకపోటంతో నాకు కొంత ఆశ్చర్యం, కొంత ఆనందం కలిగాయి. ఎందుకంటే, గొప్ప పుస్తకాల పేర్లు ఒక వంద చెప్పమంటే, ఎవ్వరి జాబితాలో అయినా తప్పకుండా ఉండే ఈ పుస్తకం పై సమీక్ష ఇక్కడ లేనందుకు ఆశ్చర్యం, నాకు ఈ పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందం. ఈ పుస్తకం పరిచయం చెయ్యటంలో ఒక పాఠకుడిగానే కాక నాకు మరో పాత్ర కూడా ఉంది. అదేమిటో తరవాత మీకు మనవి చేస్తాను.
1996 సంవత్సరంలో అనుకుంటా, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి, అశేష ఆంధ్ర పాఠక ప్రజానీకాన్ని అబ్బురపరచిన శ్రీ రామచంద్ర గారి స్వీయచరిత్ర తరవాత పుస్తక రూపం పొంది తెలుగు సాహితీ జగత్తులో ఒక అరుదైన …