నత్తలొస్తున్నాయి జాగ్రత్త

వ్యాసకర్త: బి.కృష్ణచైతన్య

**********

చందమామ కథల్లో తెలుగు ప్రజలు ఫాంటసీ కథలకు బంగారు సింహాసనమే వేసినారు. ఇక ఇంగ్లీష్ లో J R R Tolken ను ఫాంటసీ కథల పితామహుడు అంటారు . ఆయన రాసిన ‘The Hobbit’ , ‘Lord of the Rings’ ‘ ఎంతగా పాపులర్ అయ్యాయంటే , సండే టైమ్స్ పత్రిక ‘The English Speaking world is divided into those who have read ‘The hobbit and ‘The lord of the rings and those who are going to read them” అని రాసింది . ఇంక “హరీ పాటర్ ” గురించి చెప్పాల్సిన అవసరంలేదు.దీని బట్టి మనకు అర్థం అయ్యేది ఒకటే ,ఫాంటసీ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది . రచయత ఇలాంటి కథలను మన ముందు సరిగ్గా ఉంచితే అది ఒక బెస్ట్ సెల్లర్ అవుతుంది. ఇలాంటి ఒక సోషియో ఫాంటసీ ప్రయోగం మన ఆంధ్రుల ఆహ్లాద రచయత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు 1982 లో చేసిన “నత్తలొస్తున్నాయి జాగ్రత్త”.

‘నత్త’ పేరు విన్నా , ఎక్కడన్నా చూసినా ఓక సున్నితమైన ప్రాణి గుర్తుకొస్తుంది . ఇది పొరపాటున ఎవరి కాలికింద పడినా పచ్చడి అయిపోతుంది . మరి నత్త లాంటి ఒక అల్ప ప్రాణితో మనుషులకేం ప్రమాదం ? ఇంత చిన్న ప్రాణితో ఎట్లాంటి కష్ఠాలకు మనం గురికావచ్చు అనే ఊహతో మల్లాదిగారు రాసిన ఒక ఆసక్తికరమైన సోషియో ఫాంటసీ నవల “నత్తలొస్తున్నాయి జాగ్రత్త”.

కథలోకి వస్తే : ఉత్తమ్ సింగ్ కెన్యా లో భారతదేశ రాయబారి. కెన్యా లో నత్త మాంసం బాగా ప్రసిద్ధి . అక్కడ అందరు ఆ మాంసాన్ని ఇష్టంగా తింటారు . నత్త మాంసం రుచికి అప్పటికే బాగా అలవాటుపడిన ఉత్తమ్ సింగ్, రిటైర్ అయ్యి ఇండియా బయలుదేరినప్పుడు ఒక నత్తను రహస్యంగా వెంట తీసుకువస్తాడు . ఈ నత్త మామూలు నత్త కాదు , అది ఒక రాక్షస నత్త. అజాగ్రత్తగా ఉంటే వీటి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి అవి కనిపించిన చెట్టు చేమ , పంటపొలాలు వేటిని వదలకుండా తిని మాయం చేస్తాయి . ఆఖరికి గోడ మీద ఉన్న సున్నంతో సహా . ఈ విషయం తెలిసికూడా ఉత్తమ్ సింగ్ నత్తను తెచ్చుకుంటాడు . చిన్న పొరపాటు జరిగి ఈ నత్త సంతానం బయట పడి ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం చేయడం మొదలుపెడతాయి. వీటి ధాటికి రైసుమిల్లులు , చేరుకుతోటలు , పంటపొలాలు ఏవి బ్రతకవు . ఆఖరున ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడంతో నవల ముగుస్తుంది

నవల వెనక కథ : ఈ నవల పబ్లిష్ అయ్యింది 1982 లో . ఇంటర్నెట్ లేని రోజుల్లో నత్తల సమాచారం కోసం మల్లాది గారి రీసెర్చ్ ఫస్ట్ రేట్ అని చెప్పవచ్చు . ఈ నవలలో నత్తలతో పాటు , ఆఫ్రికా దేశ సమాచారం కూడా తెలుసుకోవచ్చు . కేవలం వినోదమే కాకుండా విజ్ఞానం కూడా పుష్కలంగా ఉంది. నత్తల భీభత్సం , వీటిని అదుపుచేయడానికి ప్లానింగ్ , సమస్య పరిష్కారం, మల్లాది గారి ట్రేడ్ మార్క్ ఉత్కంఠభరితమైన కథనం , ఇవన్నీ ఈ నవల బాగా పాపులర్ కావడానికి కారణాలు.

వినోదం + విజ్ఞానం + పరిశోధన +ఉత్కంఠ = ‘నత్తలొస్తున్నాయి జాగ్రత్త’

You Might Also Like