స్ఫూర్తిదాయకం… దేశభక్తి కైతికాలు…!
వ్యాసకర్త: గోపగాని రవీందర్
***********
ఆత్మీయ కవి మిత్రులు రాథోడ్ శ్రావణ్ రచించిన
అద్భుతమైన, స్ఫూర్తివంతమైన ‘దేశభక్తి కైతికాలు’ సంపుటిని పాఠ్య పుస్తకంలా అధ్యాయనం చేయాలి
మన దేశ అభివృద్ధి పల్లెల్లోని పంటల్లో వెలుగుతుంటుంది. నగరాల్లోని పరిశ్రమల్లో ప్రకాశిస్తుంటుంది.
తలపై హిమాలయాలు, నడుముకు వింధ్యపర్వతాల ఒడ్డాణం, శరీరమంతా సిరుల సంపదలు, రక్తనాళాల్లో ప్రహిస్తున్న జీవనదులు, పాదాల చెంతనే హిందూ
సాగరము, దేశ ప్రజల ఔన్నత్యం ఈ పుస్తకాన్ని పరిస్తున్న కొద్ది అనేక విషయాలు మదిలో కదలాడుతుంటాయి.
ఇంద్రవెల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పని చేస్తున్నా రాథోడ్ శ్రావణ్ స్వాతంత్య్ర్య ఉద్యమ పోరాటంలో పాల్గొన్న జాతీయ నాయకుల మీద సరళమైన భాషలో రాసిన కైతికాల సంపుటి ఇది, నార్నూర్ మండలులోని సోనాపూర్ లో రతన్ సింగ్, జిజాబాయి దంపతులకు మూడో కుమారుడుగా జన్మించారు. బాల్యం నుంచి చదువు మీద ఆసక్తి పెంచుకొని ఉన్నత విద్యావంతులయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటు, రచనల ద్వారా కూడా చైతన్యం కోసం కృషి చేయడమనే
ఆశయం పెట్టుకొని ముందుకు సాగుతున్న కవి మిత్రుడు రాథోడ్ శ్రావణ్ గారు.
దేశంలో జరిగిన పోరాట సంఘటనలు కళ్లముందు కదలాడుతుంటాయి. దేశ విముక్తికి సాగిన మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుల విజయ గాథల్ని ఈ తరానికి పరిచయం చేస్తున్న పుస్తకమిది. ఇందులో ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవ కిరణం భగత్ సింగ్ గూర్చి రాసిన ఈ కవిత హదయాన్ని హత్తుకుంటుంది.
సేక్కులో పుట్టిన
స్వాతంత్ర్య యోధుడివి. విప్లవం వర్ధిల్లాలి
నినదించన వీరుడివి
జయహో! భగత్ సింగ్
ఉరికంబవెంక్కిన ధీరుడివి.
స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిన బాలగంగాధర తిలక్ నినాదం, సత్యాగ్రహమనే ఆయుధాన్ని ధరించి ఆంగ్లేయులను తరిమికొట్టిన మహాత్మగాంధీ ధీరత్వం మీద కూడా చక్కని కైతికాలు ఈ సంపుటిలో ఉన్నాయి.
త్యాగధనుల చరిత మనదని తెలుసుకుంటాము. ఆజాద్ హిందూ పొజ్ ను స్థాపించిన పోరు సింహం సుభాష్ చంద్రబోస్ వాడవాడల రెపరెపలాడే. స్వేచ్ఛాపతాకంకై శ్రమించిన యుద్ధవీరుడతడు వందేమాతరమని తరలిన ఆశేష జన ప్రభంజనానికి దారిచూపిన గట్టి పిడుగతడు. దాస్య శృంఖలాలను ఛేదించిన వీరులకు జన్మదిచ్చిన గొప్ప తల్లివమ్మా భారతమాత అని పాడుతున్నాడు కవి. నీ బిడ్డల త్యాగఫలమే మన స్వాతంత్ర్యమని, జాతీయ నాయకుల సంకల్పం గొప్పదని, ప్రాణాలను సైతం తృణప్రాయంగా తర్పణ చేస్తు ముందుకు సాగిన ఆ నాయకుల తెగింపు సమరాన్ని గూర్చి ఈ కైతికాల్లో
చదువుతుంటే ఒట్ల పులకరిస్తుంది.
“స్వాతంత్ర్య సమరంలో
బ్రిటీష్టులను అడ్డగించి
ప్రజలను రక్షించి
శత్రువులను శిక్షించి
వారెవ్వా! ఆజాద్ సేవ
కోట్ల భారతీయుల మేవా
ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక ధీరోదాత్తుడ్కైన అంబేడ్కర్, ఒక అల్లూర్, ఒక కుమురం భీమ్, ఒక రాంజీగోండులు రగిలించిన స్పూర్తినే మన స్వాతంత్య్ర్య విజయ బావుట్కెంది. అవనిలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఆదివాసి వీరుడు కుమురం భీమ్ పై రాసిన ఈ కైతికంలోఇలా వివరిస్తున్నారు. తనదైన శైలిలో…
కెరమెరి గుట్టల్లో
ఉద్యమాలె చేసిరి
నైజాం నవాబు పై
పోరు బాట పట్టిరి
వారెవ్వా! కుమ్రం భీముడు
ఆదివాసీల సూర్యుడు ,
ప్రజలకు పోరాట వారసత్వాని
అందించిన జాతీయ నాయకుల కథలను వర్తమాన
తరాలకు వివరించాల్సినప్పుడు. ఈ పనిని కవి చాలా సమర్ధవంతంగా నిర్వహించడు కైతికాల ద్వారా ఈ కైతికాలలోని విషయాలను గ్రహిస్తే చాలు తనకు దేశం పైన ఉన్న భక్తి తెలుస్తుంది.
ప్రజలందరు విద్యావంతులు కావాలని జీవితాంతం అంకితమైన మహాత్మ జ్యోతిబాపూలే
దంపతుల సంకల్పాన్ని ఈ కైతికంలో ఇలా
వ్యక్తీకరించారు కవి.
శ్రమజీవులకు గుడి
బాలికల విద్యకై బడి
జ్యోతి సావిత్రిల జోడి
హక్కులకై పోరాడి
వారెవ్వా! సావిత్రిబాయి ఫూలే మహిళల చదువులకై పూసిన మల్లె.
మన దేశానికి మార్గదర్శనం చేసే రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన జీవితంలో అవమానాలను దాటుకుని ఉన్నత విద్యావంతుడు కావడం వలన సాధించిన విజయాలను ఈ తరానికి పరిచయం చేస్తున్నాడు కవి ఈ కవితాత్మకమైన వాక్యాల ద్వారా.
‘రత్నగిరిలో ఉదయించి
మూక్ నాయక్ స్థాపించి
జ్ఞాన శిఖరమై నిలిచి
రాజ్యాంగాన్ని రచించి వారెవ్వా! అంబేద్కరా భారతదేశ భాస్కరా
పేదోడి బతుకును మార్చెను
భవితకు దారి చూపెను
దళితుల స్థితిని చూసెను, చరిత్రలో నిలిచెను
వారెవ్వా! మెరిసిన రత్నమా
మా దళిత జాతి ముత్యమా’
మన దేశంలో ఇప్పుడు డెబ్బై ఐదు వసంతాల అమృతోత్సవాలను మనంగా నిర్వహించుకుంటున్న సందర్భమిది. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మనమంతా గర్వపడేలా, భూగోళమంతా అబ్బురపడేలా.
అత్యున్నతోత్సవాలను ఉత్సాహంగా, చిరస్మరణీయుల్కెన స్ఫూర్తి ప్రదాతలను స్మరించుకుంటూన్నాము. ఇట్లాంటి చారిత్రాత్మకమైన సందర్భంలో ‘దేశభక్తి కైతికాలు’ కవితా సంపుటిని ఉట్నూరు సాహితీ వేదిక ద్వారా వెలువరించడం గొప్ప శుభపరిణామం. రాథోడ్ శ్రావణ్ మరిన్ని రచనలతో సాహితీ ప్రయాణం చేయాని కోరుకుంటూ… హృదయపూర్వక అభినందనలు…..
పుస్తకం కోసం ఈ క్రింది చిరునామాకు సంప్రదించండి.
రాథోడ్ శ్రావణ్
ఇం నెంబర్ 2-2/1
ఐబి సుభాష్ నగర్ ఉట్నూర్
ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ
చరవాణి సంఖ్య : 9491467715
ఉట్నూర్
గోపగాని రవీందర్
లక్షెట్టిపేట,
సెల్: 9440979882
