ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము

రాసిన వారు: కాదంబరి
*****************
“ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము” – రచయిత:- డాక్టర్ మంకాల రామచంద్రుడు

గండ పెండేరములను, అనేక బిరుదు సత్కారములను పొందిన విద్వాంసుడు ప్రకాశ రావు. ఆశావాది ప్రకాశ రావు “ఆసాది” అనే దళిత ఉప కులమునకు చెందిన వ్యక్తి. ఆసాదుల వృత్తి- కథా గానము.వి.సుబ్రహ్మణ్యము నిఘంటు నిర్మాణ శాఖాధిపతి. వడ్లా సుబ్రహ్మణ్యము ఆధ్వర్యములో మంకాల రామచంద్రుడు, అవధానాచార్య ఆశావాది ప్రకాశ రావు గారి జీవన ప్రస్థాన, సాహిత్య సృజన, కృషీ క్షీర మథనమునూ చేసి, ఈ గ్రంథ నవనీతమును పఠితల చేతిలో ఉంచారు. 340 పేజీలు ఉన్న ఈ పుస్తకమును అందమైన ముద్రణతో, అచ్చుతప్పులు లేకుండా వెలువడడానికి కారకులైన ప్రచురణకర్తలు ప్రశంసార్హులు.

‌ఈ‌పుస్తకం లో ప్రస్తావించిన ఒక యక్షగానము – చెల్లపిళ్ళరాయ చరిత్రము:

చల్లపిళ్ళ, చెలపిళ్ళ అని కూడా ఈ గ్రంధములోన వాడబడినవి. “సెల్వపిళ్ళై” అనేది తమిళ పదము, ఆ మాటకు అర్ధం “సుందరమైన దైవము”. దానికి వికృతి పదమే- “చెల్లపిళ్ళ”.108 తిరుపతి క్షేత్రములు ఉన్నవి. వానిలో- ఒకటి యాదవాద్రి. మైసూరు లోని మేల్కోటె- అనే ఊరులో “యాదవాద్రి”లో శ్రీ వేంకటేశ్వర మూర్తి నెలకొని ఉన్నాడు.
తాళ్ళపాక అన్నయ:- ఈ యక్షగానము, గ్రంధ కర్త. నాందీ పద్యాలలో- “శేషాద్రిపతి కృతిభర్త పేరు; కృతికర్త నామము “తాళ్ళపాక అన్నయ్య”. అనేక ఆధారములతో- అన్నయ కవి- ప్రఖ్యాత పదకవీ ఐన “తాళ్ళపాక అన్నమాచార్యుని” మనుమడు- అని వక్కాణించాడు ఆశావాది. తాళ్ళపాక అన్నమయ్య కు ముగ్గురు కుమారులు. నరసింహ కవి, పెద్ద తిరుమలాచార్యుడు, అన్నయార్యుడు. వీరిలోని రెండవ వాడైన పెద తిరుమలాచార్యుని తనూజుడే –ప్రస్తుత వ్యాసాంశమైనట్టి “చెల్లపిళ్ళరాయ చరిత్రము” గ్రంధ రచయిత. 1500 సంవత్సర ప్రాంతము వాడు. ఇందలి కథ:- శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఢిల్లీ సుల్తాను కూతురు “బీబీ నాంచారు” ని వలచి, పెళ్ళి చేసుకోవడం. (“తిరుపగూడు” మున్నగు పదాలు ఈ యక్షగానములో కలవు)

ఈ పుస్తకమును గుంతకల్లులోని “భువన విజయ శారదా పీఠము” వారు ప్రచురించారు. ఈ గ్రంధ ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానము వారు, ఆశావాది మిత్రులు సౌహార్ద్ర ఆర్ధిక సాయాన్ని అందించారు. ఈ పొత్తమును “విజయ శారదా పీఠము” వారు ప్రచురించారు. ఈ పైన చెప్ప బడిన అంశాలు కాక, మరో ప్రత్యేకాంశము ఉన్నది. అదేమిటంటే – ఒక శిష్యుడు – తన ఉపాధ్యాయుని జీవితము గురించి రీసర్చ్ పుస్తకాన్ని రాయడము. ఆ విద్యార్ధి – డాక్టర్ మంకాల రామచంద్రుడు. ఈయన గురుభక్తితో “ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము” అనే పుస్తక రచనకు ఉపక్రమించారు. 2004 లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము నుండి P.hd.పట్టమును (పట్టాను) పొందిన గ్రంథము ఇది. [ఆధారము:-“చెల్లపిళ్ళరాయ చరిత్రము”,ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము”; పేజీ 268;]

రచన:-డాక్టర్ మంకాల రామచంద్రుడు:
ప్రచురణ:- శ్రీ కళామంజరి. షాద్ నగర్, మహబూబ్ నగర్ జిల్లా:]
ప్రతులకు:-శ్రీమతి మాధవి, M.Sc., B.Ed., ఇంటి నెంబర్:: 18-533, తిరుమల కాలనీ,షాద్ నగర్,మహబూబ్ నగర్ జిల్లా- 509216

You Might Also Like

One Comment

  1. kadambari

    నా వ్యాసమును ప్రచురించినందుకు
    pustakam.net నిర్వాహకులకు ధన్యవాదములు.

    – kadambari

Leave a Reply