పుస్తకం » భాండాగారం

మనం మరిచిన రచనలు-రచయితలు వర్గంలోని వ్యాసాలు

పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
’ఇటీజ్ నాట్ మై షర్ట్ దట్ ఐ క్యాస్ట్ ఆఫ్ టుడే బట్ స్కిన్ విత్ మై ఓపెన్ హ్యాండ్స్’ – అన్న ఖలీల్ జిబ్రాన్ కవిత్వ చరణాలతో ఒక దౌర్భాగ్య పత్రికకు అద్భుతమైన సంపాదకత్వాన్ని నిర్వహించిన బంగోరె తన పాఠకులకు వీడ్కోలు చెప్పుకున్నాడు. బంగోరెగా కీర్తిశేషుడైన బండి గోపాలరెడ్డి (1937-82) నెల్లూరు జిల్లా వాసి అని మనము చెప్పుకుంటే సాహిత్య పరిశోధనరంగమే చిన్నబుచ్చుకుంది. ఎందుకంటే బంగోరె ’రైతులో కూనిరాగాలు’ శీర్షికలో – నెల్లూరు ప్రాంత స్థానికచరిత్ర, సుబ్రమణ్యభారతి …

తెలుగు, పతాక శీర్షిక, పుస్తక పరిచయం, మనం మరిచిన రచనలు-రచయితలు, విశేష రచనలు »

“ఒక పండితోద్దండుఁ డుద్ధతుం డొక యోద్ధ
యొక మహాసమ్రాట్టు నొక మహర్షి”
అని లెనిన్‌గ్రాడ్ విశ్వవిద్యాలయం (రష్యా) తెలుగు ప్రొఫెసర్ ఎస్వీ జోగారావుగారి చేత కీర్తించబడిన హరికథా పితామహుడు కీ.శే. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస మహాకవి గుఱించి ఈనాటి యువతరానికి ఏమీ తెలియకపోవడం మిక్కిలి శోచనీయం. నిజానికి నారాయణదాసుగారి విషయమే కాదు, కథానికలూ, నవలలూ, లేదా సినిమా స్క్రిప్టులు రాసేవారిని మినహాయిస్తే ఈ తరం ఎవఱినీ గంభీరంగా పట్టించుకోవడం లేదేమో ననిపిస్తుంది. మిహతా భాషా, సాహితీవిభాగాల్లో కృషి చేసినవారంతా నిర్లక్ష్యానికి గుఱవుతున్నట్లుగా కనిపిస్తున్నది. అందులోను ఒక రచయిత/ కవి తన వ్యక్తిగత ఇష్టానిష్టాల్ని బట్టి గ్రాంథిక శైలిని, సంప్రదాయ కవితారీతినీ అవలంబించినవాడయితే అటువంటివారి పట్ల ఉద్దేశపూర్వకంగా దుర్విచక్షణ (discrimination) ప్రదర్శించడం ఒక సామాజిక సమ్మతి (social acceptability) ని పడసిన సదాచారంగా రూపుదాల్చింది. అది ఇంకా బాధాకరం.
నారాయణదాసుగారి గుఱించి నాకు …

తెలుగు, పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు, విశేష రచనలు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
1909వ సంవత్సరం. ఆ ఏడే గురజాడ కన్యాశుల్కం నాటక్ం ద్వితీయ ముద్రణ చేస్తున్నారు. ఒంగోలు మునిసుబ్రమణ్యంకు గురజాడ లేఖ రాస్తూ – ’డి.నరసయ్య అనే మిత్రుడు “పీపుల్స్ ఫ్రెండ్” పత్రిక నడుపుతూ ఉండేవాడు, నెల్లూరీయుడే..ఆయన ఇప్పుడు ఉన్నాడా? ఉంటే ఆయన చిరునామా పంపించు. ఆంగ్లభాషలో ఆయన చాలా గట్టివాడు’ అని ఉత్తరాన్ని ముగించారు. గురజాడ ఈ ఉత్తరాన్ని రాస్తున్న సమయానికి నరసయ్య చనిపోయి సరిగ్గా పదిరోజులయింది. దంపూరు నరసయ్య ఆంగ్లభాషలోనే కాదు..పత్రికా నిర్వహణలోనూ గట్టివాడు. సంపాదకునిగా, విమర్శకుడిగా గుర్తింపు …

తెలుగు, పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు, రచయిత(త్రు)లు, విశేష రచనలు »

[అతిథి | 8 Jul 2010 | 7 వ్యాఖ్యలు | 310 views]

రాసిన వారు: నిడదవోలు మాలతి
******************
మొదటి భాగం ఇక్కడ.
నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.

మదనాగయూధసమగ్రదేశము గాని
కుటిలవర్తనశేషకులము గాదు.
ఆహవోర్వీజయహరినివాసము గాని
కీశసముత్కరాంకితము గాదు
సుందరస్యందనమందిరంబగు గాని
సంతతమంజులాశ్రయము గాదు
మోహనగణికాసమూహగేయము గాని
యూధికానికరసంయుతము గాదు
సరససత్పుణ్యజననివాసము గాని
కఠిననిర్దయదైత్యసంఘము గాదు
కాదు కాదని కొనియాడఁ దగినట్టి
పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.
“కాదు, కాదం”టూ, ఏది అవునో వివరిస్తున్నానని తానే చెప్పడంలో ఆమె గడుసుదనం చూడగలం. ముందు చెప్పేను ఆమె కవిత్వంలో సంస్కృతసమాసాలు విశేషంగా ఉన్నాయని. అది కూడా పైపద్యంలో గమనించవచ్చు.
అలాగే ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తూ కవితలల్లడంలో సొగసు చూడండి. అరణ్యకాండలో సీతని వెతుకుతూ రాముడు తిరుగుతున్న ఘట్టం -
ఏమృగంబును గన్నఁ …

తెలుగు, పతాక శీర్షిక, పుస్తక పరిచయం, మనం మరిచిన రచనలు-రచయితలు, రచయిత(త్రు)లు, విశేష రచనలు »

[అతిథి | 7 Jul 2010 | 5 వ్యాఖ్యలు | 284 views]

రాసిన వారు: నిడదవోలు మాలతి
**************************
“కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ లేని కథలు చాలానే ఉన్నాయి. నిజానికి రాధికాస్వాంతనం రాసిన ముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో.
మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, లేదో, అవి దొరుకుతాయో లేదో తెలీదు. కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితులదృష్టిని ఆకర్షించడం విశేషం. తొలిసారిగా నేను గమనించింది -మొల్ల రామాయణంలో 2400 శ్లోకాలు రాసిందని “మానుషి” అన్న ఇంగ్లీషు పత్రికలో చూసినప్పుడు. ఇప్పుడు ఆవాక్యం తొలగించబడింది. ఆతరవాత లలిత, తారూ రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా శ్లోకాలనే వ్యవహరించేరు మొల్ల రామాయణంలో పద్యాలని. అప్పుడే నాకు …

తెలుగు, పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు, విశేష రచనలు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
తెలుగు పాఠకులకు సమగ్ర సమాచారంకోసం వేయి పుస్తకాలను ముద్రించిన మహోన్నత వ్యక్తి వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి (1884-1956). తెలుగు భాషకు సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణం చేసింది కూడా వీరే. అనిబిసెంట్, రాజాజీ, గాంధీజీ, ప్రకాశం పంతులు చరిత్రలు వెలువరించారు. వావిళ్ళ చేసిన వాజ్ఞ్మయసేవ అనితరసాధ్యం. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను సైతం వెలువరించి తెలుగు భాష ఉన్నంతవరకు వారు సజీవులేనని రుజువుచేసుకోవడం నెల్లూరు సాహితీసీమకు గర్వకారణం. వావిళ్ల ప్రచురణ సంస్థకు మూలపురుషుడైన శ్రీ వావిళ్ల రామస్వామిశాస్త్రి ఏకైక పుత్రుడు శ్రీ వావిళ్ల …

తెలుగు, పతాక శీర్షిక, పుస్తక పరిచయం, మనం మరిచిన రచనలు-రచయితలు, విశేష రచనలు »

[అతిథి | 18 Jun 2010 | ఒక వ్యాఖ్య | 281 views]

రాసిన వారు: మల్లిన నరసింహారావు (వేదుల బాలకృష్ణమూర్తి)
*********************
మొదటి భాగం లంకె ఇక్కడ.

సీ. ఇది మనోహర కాంతి నింపైన బింబంబు
బింబంబు గా దిది బెఁడగు కెంపు,
కెంపు గా దిది, తేఁటి యొంపని మంకెన,
మంకెన గా దిది, మంచి చిగురు,
చిగురు గా దిది వింత జిగి హెచ్చు పగడంబు,
పగడంబు గా దిది, పానకంబు,
పానకం బిది గాదు, పలుచని చెఱకు పాల్,
చెఱకు పా లిది గాదు, కురుజు తేనె, (3-42)
గీ. కురుజు తేనెయుఁ గా దిది, కుసుమ రసము,
కుసుమ రసమును గా దిది, గొనబు జున్ను,
జున్ను గా దిది, చవి గొల్కు సుధల దీవి,
సుధల దీవియుఁ గా దిది, సుదతి మోవి. (3-43)
ఎంత అందమైన పద్యం. ఎంత హృద్యంగా వుందీ పద్యం నడక. చంద్రుడు తార …

పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు, రచయిత(త్రు)లు »

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
గుంటూరుజిల్లా వాసి అయినప్పటికీ సింహపురి సాహితీదీపాన్ని వెలిగించిన బహుభాషా శాస్త్రవేత్త దీపాల పిచ్చయ్యశాస్త్రి. ఐదు దశాబ్దాలకు పైగా సింహపురి సాహితీసహవాసం చేసిన సాంస్కృతిక ఆంధ్రపండితులు వీరు. 1894లో గుంటూరు జిల్లాలో జన్మించినప్పటికీ నెల్లూరు వెంకటగిరి మహారాజా కళాశాల ఉన్నత పాఠశాలలో పాతికేళ్ళు, మరో పాతికేళ్ళు జిల్లాలో సంబంధాలు, సాహితీ నివాసంతో జిల్లా కీర్తి ప్రతిష్టలలో భాగస్వామిగా నిలిచారు. సంస్కృత,ఆంధ్ర భాషలలో ఆయన ఉద్ధండ పండితులు. తెలుగు సాహితీలోకంలోనే సాటిలేని విమర్శకుడు. అంతకుమించి అనుపమ వక్త. శబ్దముల సాధుత్వం గురించి …

తెలుగు, పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు, విశేష రచనలు »

[అతిథి | 4 Jun 2010 | 6 వ్యాఖ్యలు | 463 views]

రాసినవారు: మల్లిన నరసింహారావు (వేదుల బాలకృష్ణమూర్తి)
********************************

నక్షత్రపుఁ బేరిటి చెలి,
నక్షత్ర సుఖంబు గోరి నక్షత్రములోన్,
నక్షత్రమునకు రమ్మని,
నక్షత్రముఁ బట్టి యీడ్చె నక్షత్రేశున్.
ఇందులో ఆరు నక్షత్రాలున్నాయి. వీని అర్థం – తార అనే నక్షత్రపు పేరుగల చెలి, ఆశ్లేషా ( ఆలింగన ) సౌఖ్యాన్ని కోరి తన చిత్తములో, మూలకు రమ్మని, హస్తాన్ని పట్టి చంద్రుడిని లాగిందట. తార, ఆశ్లేష, చిత్త, మూల, హస్త, చంద్రుడు ( నక్షత్రేశుడు ) ఇవన్నీ పైన చెప్పిన ఆ ఆరు నక్షత్రాలూను.
శశాంకవిజయం చంద్రుని కథ. చంద్రుడు నక్షత్రేశుడు. ఈ కావ్యాన్ని వ్రాసిన కవి శేషము వేంకటపతి. మధుర తంజావూరుల నేలిన తెలుగు నాయక రాజులలో ఒకడైన విజయరంగ చొక్కనాథుని ఆస్థానంలోని ప్రముఖ కవి.. ఇతడు “ ఉభయ భాషా కవిత్వ ప్రయోగ కుశలుడు “అని ఇతనిని …

తెలుగు, పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు »

[సౌమ్య | 30 Apr 2010 | 2 వ్యాఖ్యలు | 324 views]

’శంకర శతకం’ – రచన కవి రామయోగి : ఈ పుస్తకం తారసపడ్డ క్షణంలోనే నేను తొలిసారి ఈపేరు విన్నాను. దానితో, కుతూహలం కొద్దీ తెరిస్తే, అరవై-డెబ్భై పేజీలు మించని ఈపుస్తకంలో, శతకం ఉన్నది ఒక ఇరవై ఐదు పేజీలేమో. అంతే. మిగితా పేజీలన్నీ, శతకసాహిత్యం గురించీ, శంకర శతకం గురించీ, రామయోగి గురించి -రాసిన వ్యాసం, ముందుమాటలే. అయితే, ఆ వ్యాసాల్లో, శతక సాహిత్యం తొలినాళ్ళ గురించి రాసిన భాగాలు – నాకు ఆసక్తి కరంగా అనిపించి, ఆ భాగాలు మాత్రం ఇక్కడ టైపు చేస్తున్నాను. నా అనుమానం ఇది బయట ప్రపంచానికి అంత పరిచయమున్న పుస్తకం కాదని (కర్నూలులో ప్రచురించారని ఉంది కనుక, లోకల్ గా సేల్స్ అయి ఉంటాయి అని ఊహిస్తున్నానన్నమాట).
ఇలా టైపు చేయడం ఒక విధంగా కాపీరైట్ల ఉల్లంఘన అవుతుందేమో. …