Latest news for ?tag=కవిత్వం

Average Rating: 4.4 out of 5 based on 209 user reviews.

రాసిన వారు: Halley **************** ఈ పరిచయం కే. టీ. ?tag=కవిత్వం అచయ (k. T. Achaya) గారు రాసిన "యిండియన్ ఫుడ్ : ఎ హిస్టారికల్ కంపానియన్" గురించి. అచయ గారి గురించి మొదట నేను 2008లో చదివాను. ఇది చదివినపుడు "నేటి మన ఇడ్లి ఇండోనేసియా నుంచి వచ్చిందా! . . హత విధీ!" అని అనుకున్నా. అప్పటి నుంచి ఈ పుస్తకం చదవాలి చదవాలి అనుకుంటూనే అలా కాలం గడిచిపోయింది . చివరకు మొన్న అమర్త్య సేన్ రాసిన "Development as freedom" పుస్తకం చదువుతూ ఉంటే అందులో ఒకచోట మిరపకాయను పోర్చుగీసు వారు మన దేశానికి తెచ్చిన వైనం గురించి రాసారు ఆయన. అప్పుడు అనిపించింది అచయ గారి పుస్తకం కొని చదవాల్సిందే అని. వెంటనే . ఈ పుస్తకం గురించి 2004లో హిందూ లో వచ్చిన . పేరుకి తగినట్టుగానే పుస్తకం మనం తినే తిండి యొక్క చరిత్ర గురించి. మన తాత మొత్తాతల కాలంలో వారి పూర్వం వేదాల కాలంలో చివరాఖరుకి ఎపుడో ముప్పైవేల సంవత్సరాల కిందటి భింబెట్క ప్రజల కాలంలోని ఆహారపు అలవాట్ల గురించి వివరంగా రాసారు అచయ గారు. ఈ పుస్తకం చదివాక మిమ్మల్ని ఎవరన్నా ప్రపంచీకరణకు ఒక నమూనా చూపమంటే ఎంచక్కా మీ వంటింటికి తీసుకొని వెళ్ళండి! టొమాటోలు ?tag=కవిత్వం, పచ్చి మిరపకాయ, టెంకాయ, పుచ్చకాయలు, నారింజ, ద్రాక్ష, ఆపిల్, వేరుసెనక్కాయ ఇలా చెప్పుకుంటూ పోతే మనం రోజు తినే ప్రతీ పదార్థము దిగుమతే అన్న యదార్థం తెల్సుకున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోక మానరు. ఇదేదో కామెడీ పుస్తకం అనుకొనేరు . . చాలా దీక్షతో చదవాల్సిన చరిత్ర పుస్తకం ఇది! కొన్ని కొన్ని కురగాయలకు పళ్లకు పంటలకు లక్షల కోట్ల ఏళ్ళ చరిత్ర ఉంది మరి . మొదటి అధ్యాయాలలో పురాతన తవ్వకాల అధ్యయనం ద్వారా బయట పడిన ఆహారపు అలవాట్ల గురించి చర్చించారు. హరప్పా నాగరికత కాలంలోని ఆహారపు అలవాట్లు వ్యవసాయపు అలవాట్లు గురించి బొమ్మలతో సహా వివరంగా వర్ణించారు. అటు తర్వాత వివిధ వేదాలలో ఆహారపు అలవాట్ల గురించి రాసిన దానిని బట్టి ఆ కాలంలో మనం ఏం తినేవాళ్ళం అన్న వివరాలు తెలుపుతూ ఒక అధ్యాయము ఉన్నది. ఇందులో వేదాలే కాక బుద్ధ జైన సాహిత్యంలోని వివిధ వర్ణనల ఆధారంతో కనుక్కొన్న విషయాలను చెప్పటం జరిగింది. అప్పడాలు వడలు పాయసం మొదలైనవి అప్పట్లోనే తినేవాళ్ళం అంట మరి . దోసకాయ ముల్లంగి అల్లం మామిడి కాకరకాయ వంటి వాటి గురించి వేదాలలో ఉపనిషత్తులలో అటు పిమ్మట చేసిన రచనలలో రాయటం జరిగిందట. 400 బి. సి కాలానికి చెందినా బౌద్ధ జైన రచనలలో మొట్ట మొదటి సారిగా టెంకాయ, పనస, అరటి వంటి వాటి గురించి రాయటం జరిగిందట. మరి దీనిని బట్టి అంతకు పూర్వం ఇవన్ని మన దేశం లో లేవు అని అనుకోవాలేమో. దీని తర్వాత మన వేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో మాంసాహారపు అలవాట్ల గురించి ఏం చెప్పారో వివరించారు. నాకైతే ఈ అధ్యాయం భలే నచ్చేసింది. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో యజ్ఞాలలో యాగాలలో బలి ఇచ్చే జంతువులని ఏం చేసేవారు అని ఒక సందేహం ఉండేది. ఇది చదివాక ఆ సందేహ నివృత్తి అయ్యింది మరి. పూజ పూర్తయ్యాక నైవేద్యం మనమే తినేసినట్టు ఎంచక్కా ఆవురావురు మంటూ ఆ బలి ఇచిన జంతువులని వండుకు తినేవాళ్ళం అంట . ఋగ్వేదం లో ఒకానొక చోట గుర్రపు మాంసము వండు విధానము చాల వివరంగా రాసారట. నేను ఈ విషయమే ఒక మిత్రునితో అంటే అతను నవ్వేసి "అశ్వమేధ యాగం"లో చంపిన గుర్రాలతో ఇంకేం చేసేవాళ్ళు అనుకున్నావు అని అన్నాడు. నిజమే కదా! అచయ గారి ప్రకారం అప్పటి బ్రాహ్మణులు కూడా గుర్రపు మాంసం రుచినెరిగిన వారే అట. రామాయణంలో వనవాస కాలంలో సీతాదేవికి ప్రియాతి ప్రియమైన వంటకం పేరు "మాంసభుతదన" అని రాసారు. అంటే ఏంటో అనుకొనేరు అన్నం + లేడి మాంసం + కూరగాయలు + మసాల = మాంసభుతదన అంట. అలాగే దశరథ మహారాజు చేసిన యజ్ఞంలో నెమలి మాంసం వగైరా వంటకాలు ఉండేవట. ఇది చాలదు అనట్టు ముళ్ళపంది, కుందేలు, తాబేలు, ఉడుము మాంసాల గురించి కూడా రాసారు. ఇది కాక మహాభారతంలో ధర్మరాజు పదివేల మంది బ్రాహ్మణులకు పంది మాంసం మరియు లేడి మాంసం వడ్డించిన విషయమూ మరియు ఆ మహాకావ్యంలో మరొక చోట ఒంటె, గాడిద మాంసం వండు విధానం గురించి చేసిన వర్ణనల గురించి చెప్పారు. ఖడ్గ మృగ మాంసం మరియు కోతి, ఏనుగు మాంసం గురించి కూడా బౌధయన ధర్మసుత్రాలలో రాసి ఉంది అట. వరాహమిహిరుని "బ్రిహత్సంహిత"లో బర్రె మరియు బల్లి ని తినటం గురించి కూడా రాసారట. "చరక సంహిత" లోనేమో మొసలి మరియు నక్కలను తినదగిన జంతువుల చిట్టాలో చేర్చారట. ఇదంతా చెప్పాక అసలు గోవధ నిషేధం ఎలా మొదలైందీ, బ్రాహ్మణులకు తీవ్ర మాంసాహార నిషేధం ఎపుడు ఎలా అమలు లోకి వచ్చిందీ మరియు జైన బౌద్ధ సంప్రదాయాల వలన శాకాహారపు అలవాట్లకు కూరగాయల వాడకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం ఎలా మొదలైందీ వంటి విషయాలు వివరించారు. నేటి భారతంలో శాకాహారులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు దానికిగల చారిత్రక కారణాలు ఏమిటి వగైరా విషయాలను కూడా వర్ణించారు. రకరకాల మద్యపానీయములు తయారు చేసే విధానముల గురించి సంస్కృత సాహిత్యంలో చేసిన వర్ణనలు, రామాయణంలో సీత రాములు వైను సేవించిన విషయమూ, సాంచి స్తూపము, పట్టడక్కళ్ శిల్పాలలో ప్రజలు కుటుంబ సభ్యులందరితో కలిసి మద్యం సేవిస్తునట్టుగా చూపిస్తూ చెక్కిన శిల్పాల గురించి చెప్తూ ఈ అధ్యాయం ముగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆహారపు పద్దతులు, దక్షిణ భారతంలోని ఆహారపు అలవాట్లు, వైద్యానికి మనం తినే తిండికి అప్పట్లో ఉన్న లంకె, రాజుల భోగభాగ్యాలు, ఎందఱో యాత్రికుల వర్ణనలు, ముస్లిం రాచరికపు ప్రభావం, యూరోపు యాత్రికులు మరియు వలసపాలకుల ప్రభావము ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పారు ఈ పుస్తకంలో. చివరగా ఈ పుస్తకంలో రాసిన కొన్ని పిట్టకథల గురించి చెప్పి ఈ పరిచయం ముగిస్తాను. పైనాపిలు/అనాసపండు దక్షిణ అమెరికా నుండి మన దేశమునకు వచ్చిందట. జలేబి పెర్షియా [?tag=కవిత్వం] మరియు అరబ్బు దేశాల దిగుమతి అట. టెంకాయ "పపువా న్యు గిని (Papua New Guinea)" నుంచి సముద్రపు అలల పుణ్యమా అని హిందూ ?tag=కవిత్వం మహా సముద్రం లో పడి ఎపుడో మన దేశానికీ వచ్చినదట. చిలగడ దుంప "పెరు" నుంచి వచ్చినదట. రాజ్మ దక్షిణ అమెరికా నుంచి వస్తే రాగి ఉగాండా నుంచి వచ్చింది అంట. బియ్యం తూర్పు భారతం, చైనా, వియత్నాం నుంచి దక్షిణ భారతం అంతటా వ్యాపించిందట. జోన్నలేమో ఇథియోపియా నుంచి వచ్చాయట. నువ్వులు ఆవాలు మాత్రం అచ్చంగా మనవేనట. వంకాయ కూడా మనదేనట అందుకనే "వంకాయ వంటి కూరయు" అన్నారేమో బహుశా. బెండకాయ ఆఫ్రికా నుంచి వచ్చినట్టే మన గోంగూర కూడా అంగోలా లేదా సూడాన్ నుంచి వచిందట. దోసకాయ మాత్రం కచ్చితంగా మన దేశంలో పుట్టినదేనట. అలాగే మోసంబి నిమ్మ నారింజ మామిడి పండు మరియు పనస పండు కూడా మనవేనట. పసుపు, మిరియాలు, యాలకులు మన దేశానివే. అప్పట్లో వీటి కోసమే యూరోపు రాజులూ మన దేశానికి వచ్చారు అన్నది మనకి చరిత్ర చెప్పే సత్యం. గుమ్మడిపండు మెక్సికో నుంచి వచ్చిందట. అలాగే దానిమ్మేమో ఇరాన్ నుంచి వచ్చిందట. వీటిలో కొన్ని మనిషి పుట్టుకకి మునుపే సముద్రాలలో తేలుతూ ప్రపంచమంతా వ్యాపించాయట. ఇవి కాక వలస వచ్చిన వారు తెచ్చినవి మరి కొన్ని. వేరుసేనక్కాయ యూరోపు వారు తీసుకొని వస్తే సోయాబీను చైనా నుంచి వచిందట . ఇక సన్ ఫ్లవర్ అయితే 1940-70 వరకు అసలు మన దేశంలో లేనే లేదట. అటు తర్వాత రష్యా నుంచి వచ్చిందట. జీడి పప్పు పోర్చుగీసు వారు తెచ్చారట. టొమాటో మెక్సికో లో పుట్టి 1550 లో ఇంగ్లండు వచ్చి 18 వ శతాబ్దంలో ఇండియా వచిందట. ఆలూ/ఉర్లగడ్డ బొలివియా నుంచి 1570 లో యూరోపు చేరి 1830 లో ఇండియా వచిందట. ఇది కాక అయన జంతువుల గురించి కూడా చెప్పటం మొదలెట్టారు చివరాఖరున. ఇంకా ఈ చరిత్రను భరించటం నా వల్ల కాదు బాబోయి అని నేను పుస్తకం ముసేద్దాం అని అనుకొనే లోగా చివరి పేజి కి వచేసాను. దాదాపు ఇరవై పేజీలు ఆయనకు పుస్తకం రాయటానికి ఉపయోగ పడిన రచనల చిట్టా మరో ఇరవై పేజీలు అయన పుస్తకంలో వాడిన ఇతర భాషల పదాల పట్టిక! ఈ నలభై పేజీలు చాలు అయన ఈ పుస్తకం రాయటం కోసం ఎంత కష్టపడ్డారో తెల్సుకోటానికి! చాలా మంచి పుస్తకం . మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను .


?? 2008-2016 Legit Express Chemist.