Focus-Classical Poetry ట్యాగు తగిలించిన వ్యాసాలు
తెలుగు, పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు »
’శంకర శతకం’ – రచన కవి రామయోగి : ఈ పుస్తకం తారసపడ్డ క్షణంలోనే నేను తొలిసారి ఈపేరు విన్నాను. దానితో, కుతూహలం కొద్దీ తెరిస్తే, అరవై-డెబ్భై పేజీలు మించని ఈపుస్తకంలో, శతకం ఉన్నది ఒక ఇరవై ఐదు పేజీలేమో. అంతే. మిగితా పేజీలన్నీ, శతకసాహిత్యం గురించీ, శంకర శతకం గురించీ, రామయోగి గురించి -రాసిన వ్యాసం, ముందుమాటలే. అయితే, ఆ వ్యాసాల్లో, శతక సాహిత్యం తొలినాళ్ళ గురించి రాసిన భాగాలు – నాకు ఆసక్తి కరంగా అనిపించి, ఆ భాగాలు మాత్రం ఇక్కడ టైపు చేస్తున్నాను. నా అనుమానం ఇది బయట ప్రపంచానికి అంత పరిచయమున్న పుస్తకం కాదని (కర్నూలులో ప్రచురించారని ఉంది కనుక, లోకల్ గా సేల్స్ అయి ఉంటాయి అని ఊహిస్తున్నానన్నమాట).
ఇలా టైపు చేయడం ఒక విధంగా కాపీరైట్ల ఉల్లంఘన అవుతుందేమో. …
తెలుగు, పతాక శీర్షిక, సమీక్షలు - అభిప్రాయాలు »
రాసిన వారు: వైదేహి శశిధర్
***************
నా ఆరవ తరగతి లోనో ,ఏడవ తరగతిలోనో చదువుకున్న ఒక పువ్వు గుర్తు పద్యం నాకిప్పటికీ గుర్తున్న ఈ పద్యం .గొప్ప కవిత్వం అనుకున్న పద్యాలు/కవితలకు ఏమన్నా సాదృశ్యాలూ సారూప్యాలూ ఉంటాయా అన్న ఆలోచన నాకు తరచుగా కలుగుతూ ఉంటుంది.నేను గొప్ప కవిత్వం అనుకున్న కవితలలో ఉన్న లక్షణాలకోసం వెతుకుతూ ఉంటే నా అనుభవంలోకి వచ్చిన లక్షణాలు రెండు. ఒకటి కంఠవశమయ్యే లక్షణం,మరొకటి వెంటాడి పదే పదే స్ఫురణకు వచ్చే లక్షణం. నిజానికి ఈ రెండు లక్షణాలు పరస్పరం అనుబంధిత విషయాలు కూడా.ఒకటి లేకుండా మరొకటి సాధ్యం కాదు. కంఠవశం అయితేనే కదా ,పదే పదే గుర్తుకు వచ్చి వెంటాడేది !
నాకు అలా గుర్తుండిపోయిన పోయిన ఈ పద్యం,నందితిమ్మన “పారిజాతాపహరణం” లోని ఒక చంపకమాల పద్యం. …
కవితలు, తెలుగు, పతాక శీర్షిక, పుస్తక పరిచయం, ఫోకస్, విశేష రచనలు »
వ్యాసం రాసిపంపినవారు: భైరవభట్ల కామేశ్వరరావుగారు
=====
మన్మహాయోగ నిష్ఠా సమాధినుండి
విక్రియాపేత బ్రహ్మ భావించు వేళ
పట్టరాని సౌందర్య పిపాస తగిలి
భ్రష్టయోగిని కవిజన్మ బడసినాడ
ఈ కవి పూర్వ జన్మలో ఒక యోగి-ట. గొప్ప యోగదీక్షతో సమాధిలో నిర్వికారమైన పరబ్రహ్మం గురించి తపస్సు చేస్తున్న వేళ, ఒక పట్టరాని సౌందర్య పిపాస (అంటే సౌందర్యాన్ని తాగాలనే విపరీతమైన కాంక్ష) తగులుకొని ఆ యోగి తపస్సు భంగమైపోయింది. అప్పుడా భ్రష్టయోగి కవిగా జన్మించాడట. తపోదీక్షలో ఉన్న తన మనసు ఎలా ప్రాపంచిక విషయాలపై మోహం చెంది, యోగ భ్రష్టుడై. తాను కవిజన్మ పొందాడో మరొక మూడు పద్యాలలో వర్ణించే పద్యకవిత “భ్రష్టయోగి”. ఇది విశ్వనాథ సత్యనారాయణగారు 1926కి పూర్వం రాసింది, అంటే అతని తొలినాళ్ళ కవిత. కవిగా తనని తాను కనుగొంటున్న కొత్తలో రాసుకున్న కవితన్నమాట. ఒకవైపు గాఢమైన ఆధ్యాత్మికత, మరో వైపు తీవ్రమైన భావోద్రేకం …
తెలుగు, పతాక శీర్షిక, పుస్తక పరిచయాలు »
చిన్నప్పుడు స్కూల్లో తెలుగులో ఏనుగు లక్ష్మణకవి రాసిన సుభాషితాలు, బద్దెన సుమతీశతకం, వేమన శతకం ; సంస్కృతాన భర్తృహరి సుభాషితాలు – ఇలా ప్రతి నీతిశతకం నుండీ ఏదో ఒకటి, ఎంతో కొంత పాఠ్యాంశంగా చదువుకుని ఉండటంవల్ల, వీటి గురించిన కుతూహలం ఉండేది. అయితే, ఇంట్లో ఉన్న ’టీకాతాత్పర్య సహితాలు’ అయిన వివిధ శతకాలను ఓసారి ప్రయత్నించి చూడాలి అన్న సాహసం ఎప్పుడూ చేయలేకపోయాను. పద్యాలు నాకు అందని ద్రాక్షలు అన్న భావనలో ఉన్నా కనుక, అవి పుల్లగా ఉంటాయని ఫిక్సయాను. ఈమధ్య హైదరాబాదొచ్చినపుడు ఇంట్లో ఈశతకాల పుస్తకాలు కనబడితే ఇవి తిరగేస్తూ ఉంటే అర్థమైంది – అవి నిజంగా పిల్లలు చదూకోడానికి ఉద్దేశించి, తేలిగ్గా అర్థమయ్యేలా రాసారని. పోయిన ఫోకస్ కి రాసి ఉండాల్సిన వ్యాసమేమో, కానీ, ’పద్య సాహిత్యం’ అన్నారు కనుక, ఇప్పుడు కూడా …
తెలుగు, పతాక శీర్షిక, విశేష రచనలు »
రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న
******************
పుస్తకం.నెట్ వారు ఈ నెలలో “తెలుగు పద్య సాహిత్యం” పై ప్రత్యేక దృష్టితో పుస్తక పరిచయాలూ, సమీక్షలూ, వ్యాసాలూ కావాలని కోరుతూ నన్ను కూడా నా వంతు కృషిగా ఏదైనా రాసి పంపమన్నారు. పద్య సాహిత్యం గురించి రాసే అర్హతలు నాకేమున్నాయి? జీవితంలో ఒక్క పద్యమైనా రాసినవాణ్ణి కాదు. అయినా ఈ వచ్చిన అవకాశాన్ని ఒక సవాలుగా తీసుకొని, నచ్చిన ఈ పుస్తకాన్ని ఈసారైనా వీలైనంత జాగ్రత్తగానూ, పూర్తిగానూ చదివి నా అభిప్రాయాలని, ఆలోచనలని మీతో పంచుకొనే సాహసమే ఈ ప్రయత్నం!
“మహా రచయితలందరూ మానవజాతి సంపద.” ఇవి నా మాటలు కావు. గొప్ప తెలుగు కథా రచయిత రావిశాస్త్రి సమగ్ర సాహిత్యం పుస్తకంలో సంపాదకుల ముందు మాట. ఎంత నిజం. తెలుగు పద్య సాహిత్య కర్తలు తెలుగు జాతి సంపద. తెలుగు వచనమే …
తెలుగు, పతాక శీర్షిక, మనం మరిచిన రచనలు-రచయితలు, విశేష రచనలు, సమీక్షలు - అభిప్రాయాలు »
రాసిన వారు: కాశీనాథుని రాధ
*****************
పదహారో శతాబ్దంలో కృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడై , పెద్దనతో బాటు రాయల వారికి కావ్యాన్ని అంకితం చేసిన కవి నంది తిమ్మన. కృష్ణ రాయల వారి భార్య వెంట అరణం వచ్చిన కవి అనీ, రాజుగారికి, రాణిగారికి వచ్చిన అపార్ధాన్ని సవరించడం కోసం పారిజాతాపహరణ కావ్యాన్ని రాసాడని అంటారు. ఏది ఏవైనా అయిదొందల ఏళ్ళనాటి ప్రాచీన సాహిత్యాన్ని మనం ఎందుకు చదవాలి? అంటే …
పాత వాళ్లైనా కొత్త వాళ్లైనా కవులు కవులే. ఆనాటి కవులు సృష్టించిన పాత్రలు వాటి గుణగణాలు, స్వభావాలు మనకి పరిచయం ఉన్నవే. వాళ్ళ భాషాప్రయోగాలు చూసి పెదవి విరిచిన సందర్భాల కంటే ‘ ఔరా’ అనుకున్న సందర్భాలే మోతాదులో కాస్త ఎక్కువని …
తెలుగు, పతాక శీర్షిక, పుస్తక పరిచయం »
“నా తెలుగు బాగోదు, మెరుగు పర్చుకోడానికి మార్గాంతరాలు చూపండి” అని కోరగానే వినిపించిన తారక మంత్రం, “బూదరాజు రాధాకృష్ణ”. మర్నాడే విశాలాంధ్రకెళ్లి ఆయన పేరు మీదున్న పుస్తకాలు ఎన్ని ఉంటే అన్ని తెచ్చుకున్నాను. వాటి పేర్లలన్నీ ఇప్పుడు అప్రస్తుతం కానీ, కొన్ని పుస్తకాలు మాత్రం చాలా నచ్చాయి. మచ్చుకు, శ్రీశ్రీ మీద రాసిన మోనోగ్రాఫ్, ఇంకా “మరువరాని మాటలు” అని తెలుగు సాహిత్యం లోని కోట్స్ – ఈ రెండో పుస్తకం వల్లే ఆలూరి బైరాగి పరిచయం జరిగింది. బూదరాజుగారి పుస్తకాల వల్ల నా తెలుగు ఎంత బాగుపడిందో అప్రస్తుతం (అవును మళ్లీ!) గానీ, ఆయన పేరు ఏ పుస్తకం మీద చూసినా కొనటం మొదలెట్టాను. అందులో కొన్ని నాకు కొరకరాని కొయ్యలయ్యినా, కొనడం మాత్రం మానలేదు. మొన్నటి హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనలో – ఏ స్టాలో …
పతాక శీర్షిక, ఫోకస్ »
పుస్తకం.నెట్ లో ఈ నెల ఫోకస్ ” తెలుగు పద్య సాహిత్యం” . ఈ ఫోకస్ లో - పద్య సాహిత్య ప్రధానమైన పుస్తకాల పరిచయాలు, సమీక్షలతో బాటు, మీ అభిమాన పద్య రచయిత పై వ్యాసాలూ, పద్యసాహిత్యం లో ని ప్రక్రియల పై వ్యాసాలూ, మీ పద్య పఠనానుభవాలు – లాంటి వాటిన్నింటి పై రాయవచ్చును. ఇతర భాషల నుండి తెలుగులోకి అనువదింపబడ్డ పద్య సాహిత్యం పైనా రాయవచ్చును.
అంతే కాక, ఒక ఇద్దరు ముగ్గురు కల్సి, ఏదైనా కావ్యం పై మెయిళ్ళలో చర్చించి, దాని విశేషాలను పుస్తకం.నెట్ లో ప్రచురించవచ్చు. చర్చ పై ఆసక్తి ఉన్న వారు, మాకో వేగు పంపితే, ఆసక్తి ఉన్న తక్కిన వారిని పరిచయం చేస్తాం.
ఈ అంశం పై సలహాలూ, సూచనలూ, …
