తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు శ్రీశ్రీ. ఆయన ఆత్మకథే ఈ “అనంతం”. ఆయన ప్రకారం ఇది “ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల”. కాస్తో కూస్తో శ్రీశ్రీ రచనలతో ప్రత్యక్ష చదువరులుగానో పరోక్షంగా ఏ ఆకలిరాజ్యమో, రుద్రవీణో చూసో సంబంధం ఉన్నవారెవరికైనా ఆయన జీవితం గురించిన కుతూహలం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అందునా ముందురోజుదాకా శ్రీశ్రీ కథలు వగైరా చదువుతూ ఉన్నానేమో, “అనంతం” కనబడగానే టక్కుమని చదవడం మొదలుపెట్టేశాను. మూడొందలకి పైగా పేజీలున్న ఈ పుస్తకాన్ని ఏకబిగిన కాకపోయినా చిట్టి విరామాలూ, ఓ రాత్రి నిద్రా మినహాయిస్తే ఓరోజులోపే చదవడం పూర్తిచేసానంటే పుస్తకం ఆసక్తికరంగా ఉందని వేరే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను.
ఇదివరలో ఎప్పుడూ కవుల ఆత్మకథలు చదివినట్లు జ్ఞాపకంలేదు నాకు. ఇదే మొదటిది అనుకుంటాను. ఈ ఆత్మకథ ద్వారా కవులగురించీ, కవిత్వం గురించీ – తెలుగు కవులే కాదు ఎంతో …
“ఈ రోజు నువ్వు చేస్తున్నపని…
రేపటి నీ గమ్యానికి నిన్ను దూరంగానో, దగ్గరగానో తీసుకెళ్తుంది.
ఇంతకీ నీ గమ్యం ఏమిటి?
డబ్బా? ఆనందమా?
కుటుంబమా? అధికారమా?”
అన్న ప్రశ్నతో మొదలైన యండమూరి వీరేంద్రనాథ్ కొత్త నవల ‘వీళ్లనేం చేద్దాం?’ ఎప్పట్లానే ఆపకుండా చదివిస్తుంది. ఆలోచింపజేస్తుంది. రచన విజయవంతమవటానికి ఈ లక్షణాలు చాలేమో. యండమూరి కలం నుంచి కొత్త నవలలు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తే. ఏం కావాలో తెలియక, అందర్లాగే మనమూ అంటూ జీవితపు పరుగుల్లో కొట్టుకుపోతున్న వారిని ఆపి, ఆలోచించమంటుంది ‘వీళ్లనేం చేద్దాం?’ ఈ నవల కథ గురించి చెప్పాలంటే – తరాలు తిన్నా తరగని సొమ్మును సంపాదించాలనుకునే రాయకీయ నాయకుల ప్రయత్నాలను విమర్శించడం. అంతే. కానీ యండమూరి నవలలు సొంతగా చదువుతుంటే వచ్చే మజా వేరెవరో కథ చెబితే రాదనుకుంటా. ఆయన కథ, కథనం, శైలి.. వీటన్నిటి మీదా భిన్నాభిప్రాయాలున్నా, …
ఈ ఏడాది చదవటం మొదలెట్టి పూర్తి చేసిన మొదటి పుస్తకం బూదరాజు రాధాకృష్ణ(Budaraju Radhakrishna) రచించిన “మహాకవి శ్రీశ్రీ” (Mahakavi SriSri). శ్రీశ్రీగారి పుట్టినరోజు (జనవరి రెండువ తారీఖు) నాడు మొత్తం వారి రచనలతోనే గడిపానని గ్రహించలేదు చదివేటప్పుడు! ఈ పుస్తకం మొన్న బుక్ ఫేర్ లో కొన్నాను, అసలు వేరే ఏ రచయితయినా అయ్యుంటే, “నేను శ్రీశ్రీ అనంతం చదివా, ఇంకెందుకూ.. లైట్” అనుకుంటూ ముందుకెళ్ళిపోయేదాన్ని. కానీ బూదరాజు గారి గురించి చాలా వినుండడం వల్ల, శ్రీశ్రీతో పాటు బూదరాజు గారి గురించీ తెల్సుకునే అవకాశం లేకపోలేదు కదా అని తీసుకున్నాను. వంద పేజీలుండే ఈ రచన, అదీ నాకు ముందే తెల్సిన వ్యక్తి గురించి, ఎంత సేపులే చదవటం అనుకుంటూ మొదలెట్టాను. ఈ పుస్తకం పరిచయం తెల్సు కాబట్టి, సరిపడా చనువుంది.. పని ఇట్టే …
వ్యాసం రాసిపంపిన వారు: కొల్లూరి సోమ శంకర్
“స్ఫూర్తినిచ్చే వాస్తవ విజయ గాథలు” అన్న ఉపశీర్షిక ఈ పుస్తకానికెంతో ఉపయుక్తంగా ఉంది. ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో వారం విడిచి వారం రాసిన ‘రియల్ స్టోరీస్’ అనే శీర్షికలోంచి ఎంచుకున్న 50 వాస్తవ గాథలని ఈ సంకలనంలో అందించారు.
సాధారణంగా మనుషులు కష్టాలు రాగానే క్రుంగిపోతారు, బెంబేలెత్తిపోతారు. కొందరేమో సమస్యనుంచి పారిపోయి, తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు. మరికొందరు మౌనంగా, నిస్సహాయంగా విలపిస్తారు. మరొకొద్దిమంది మాత్రమే తాము అనుభవించిన కష్టాలు మరెవ్వరూ అనుభవించకూడదనే ఉద్దేశ్యంతో ఇతరులను జాగృతం చేస్తారు, తోటివారికి మార్గదర్శనం చేస్తారు. అటువంటి వ్యక్తుల గాథలే ఇవి.
తల్లిదండ్రులు తిట్టారని అలగి ఇంట్లోంచి పారిపోయే పిల్లలు, ఉద్యోగాలు దొరకడం లేదనో, పెళ్ళిళ్ళు కావడంలేదనో జీవితం అంతం చేసుకునే వ్యక్తులు…. ఇంకా అనేక చిన్న పెద్దా సమస్యలతో …
“పదమూడేళ్లు నిండకుండా, ఏడో క్లాసు కూడా గట్టెక్కకుండా, నిన్ను ఒక చదువులేని మూర్ఖుడికిచ్చి కట్టబెడితే, ఒక పిల్లాడు ఇంకా పాలుతాగే పసివాడుగా ఉండగానే మళ్లీ కడుపుతో ఉండి, అలా చూస్తుండగానే నువ్వు ముగ్గురు పిల్లల తల్లివైపోతే, పాతికేళ్ల వయసులో శరీరమూ మనసూ డస్సిపోయి, పిల్లల్తో సహా నువ్వు సుదూర ప్రాంతానికి, బొత్తిగా తెలియని చోటికి వెళ్లవలసి వస్తే పొట్ట నింపుకొనేందుకు వేరే దారి లేక, ఇల్లూడ్చి తుడిచి అంట్లు కడిగి, వంట చేసి డబ్బు సంపాదిస్తూ, పిల్లల విరోచనాలూ, జలుబూ దగ్గూ, తిండీతిప్పలూ, చదువూ సంధ్యా వీటన్నింటి గురించి నువ్వే అవస్థ పడాల్సి వచ్చి కూడా, నీలో ఉండే చదువుకోవాలన్న తపనని నువ్వు ఎప్పటికప్పుడు బతికి ఉంచుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటే, ఏడో క్లాసు వరకూ చదువుకున్న వచ్చీ రాని భాషలోనే నువ్వు ఎంచుకున్న దారిలోని ఆపదల గురించి …