విశాలాంధ్ర వారు ఓ ఐదారేళ్ళ క్రితం క్రితం శరత్ సాహిత్యాన్నంతటినీ తెలుగులో పది భాగాలుగా ముద్రించే పనికి పూనుకున్నారు. (తర్వాత భాగాల సంఖ్య పెంచారేమో నాకు తెలీదు). దేవదాసుతో మొదలై, ఆయన నవలలూ, నవలికలూ, నాటకాలన్నీ అయ్యాక, చివరి భాగంగా 2008లో ఈ కథలు ముద్రించారు. దీని అనువాదకులు బొందలపాటి శివరామకృష్ణ గారు.
(నేనూ శరత్ అభిమానినే అని ముందే చెప్పేసి ఈ వ్యాసం రాస్తున్నాను. అయితే, ఆ అభిమానం కొన్ని నవలలకి మాత్రమే పరిమితం.)
కథల విషయానికొస్తే, మొత్తం ఇరవై రెండు కథలు. మూకుమ్మడి ఏడుపు కథలు. ఇవి చదివితే ప్రపంచం మొత్తంలో అదృష్టహీనులే అన్న భావన కలుగుతుంది. అరే! ఒక్క కథలో అయినా కాస్తైనా ఆశావాదం కనబడదే! కథలన్నాక మనుషులు రకరకాలుగా రాస్తారు – ఒప్పుకుంటాను. కానీ, 22 కథలు ఒకేలాగ రాస్తే, మిగితా సంగతులటుపెడితే value …
రాసిన వారు: Halley
************
నాకు Indiaplaza.in ద్వారా పరిచయం అయిన ఎన్నో మంచి పుస్తకాలలో ఇదీ ఒకటి. పుస్తకం కవర్ పేజీలో చెప్పినట్టు ఇది ప్రధానంగా “Insights and accidents from a hall-of-fame career in advertising” గురించి. నాకు ప్రకటనా ప్రపంచం, మార్కెటింగ్ మరియు ప్రచారాల వెనుక కంపెనీలు పడే కష్టాల గురించి సమగ్రంగా చర్చించే ఒక పుస్తకం చదవాలి అని ఎప్పటి నుంచో కోరిక . ఈ పుస్తకంతో ఈ కోరిక తీరింది అని అనటం కంటే ,ఈ పుస్తకం ఇలాంటివి మరిన్ని చదవాలి అని అనిపించేటట్టుగా చేసింది అనటం సబబు. ఇదేదో ఈ పుస్తకం బాలేదు అని చెప్పటంకాదు, ప్రకటనా ప్రపంచంలో తెల్సుకోటానికి ఇన్ని విషయాలు ఉన్నాయా అని అనిపించేలా చేసింది ఈ పుస్తకం.
రచయిత ఫిల్ డూసెన్బెరీ అమెరికా లోని …
రాసిన వారు: సుజాత
***************************
“మా తాత పులిలా బతికాడు, మా నాన్న సింహంలా బతికాడు,…”అంటూ ఒక మొగుడు గారు గొప్పలు చెప్పుకోబోతే “అయితే మీ వంశంలో మనుషుల్లా బతికిన వాళ్లెవరూ లేరన్నమాట”అని విసురు విసిరిందిట భార్యామణి అమాయకంగా మొహం పెట్టి. “మా కుటుంబం” అన్న పేరు చూడగానే ఇలాగే ఎవరిదో వంశ చరిత్రో ఏమిటో అని జంకుతూ జాగ్రత్తగా చూస్తే అది కవన శర్మగారి పుస్తకమైంది. అడపా దడపా ఆయన రచనలు (“రచన”లో)చదువుతూ ఉండటం వల్ల ఇక సంకోచించకుండా కొన్నాను.
తెలుగులో ఇలాంటి పుస్తకం ఇంతవరకూ రాలేదని గట్టిగా చెప్పగలననిపించింది. అసలు ఇలాంటి పుస్తకం ఒకటి రాయొచ్చని కూడా ఇప్పుడే తెల్సింది.
కవనశర్మ గారు,ఆయన తల్లి గారు భాస్కరమ్మ, సతీమణి విజయలక్ష్మి,కుమార్తెలు శారద,లక్ష్మీ నాగపద్మ,వీళ్ళంతా కల్సి వారి కుటుంబం గురించి రాసుకున్న పుస్తకమే ఇది.కాకపోతే ఇందులో ఉన్నది వంశచరిత్ర …
సమీక్షకుడు – మద్దిపాటి కృష్ణారావు
[2006 సెప్టెంబర్ 24 వ తేదీన DTLC (Detroit Telugu Literary Club, USA) లో గడియారం రామకృష్ణశర్మ గారి ఆత్మకథ మీద జరిగిన చర్చ సందర్భంగా రాసిన సమీక్ష]
**********************************************************************
శతపత్రము గడియారం రామకృష్ణశర్మ గారి ఆత్మకథ. ఈ పుస్తకాన్ని చర్చించడానికి నిర్ణయించుకున్నప్పటికి, గడియారం రామకృష్ణశర్మ గారెవరో చర్చలో పాల్గొన్నవారెవరికీ తెలియదు. కానీ ఈ పుస్తకాన్ని చదవమని సూచించిన శ్రీ నవోదయ రామ్మోహనరావు గారికి కృతజ్ఞతలు చెప్పాలన్నది అందరి అభిప్రాయం.
1919 లో జన్మించిన శర్మ గారు, ఈ పుస్తకాన్ని కొందరి మిత్రుల, అభిమానుల ప్రోత్సాహంతో 1995 లో వ్రాయడానికి పూనుకున్నారు. కానీ పూర్తి చేసి ప్రచురించింది
2004 లో. అంటే పుస్తకం పూర్తయిన తరువాత రెండు సంవత్సరాలకే వారు దివంగతులవ్వడంతో, ఇది ఇంచుమించుగా వారి సంపూర్ణ జీవిత ఆత్మ చరిత్ర. శర్మ గారు …
వ్యాసం రాసిపంపినవారు: సి.బి.రావు
శ్రీకాకుళంలో కధానిలయం స్థాపకులు కాళీపట్నం రామారావు గారు మెచ్చిన శ్రీమతి వారణాసి నాగలక్ష్మి ప్రఖ్యాత కధా రచయిత్రి. వీరి కధలకు పలు పత్రికల పోటీలలో బహుమతులు లభించాయి. వీరి కధా సంపుటి ఆలంబన 2005 లో వెలువడింది. ఆలంబన పై సమీక్షకై ఇక్కడ చూడవచ్చు. అచ్చు పత్రికలే కాకుండా అంతర్జాల పత్రికలైన కౌముది,సుజన రంజని, భూమిక వగైరా పత్రికలలో కూడా నాగలక్ష్మి కధలు ప్రచురించబడ్డాయి. కధలే కాకుండా నాగలక్ష్మి గేయ రచయిత్రి, చిత్రకారిణి కూడా. ఇవి మాత్రమే కాకుండా నాగలక్ష్మి ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. హోమియోపతి డాక్టరు సునీత తో జరిపిన భేటీ ఇక్కడ. వీరి గేయాలు “వాన చినుకులు” గా 2003 లో ఒక కవితా సంపుటంగా వెలువడ్డాయి. నాగలక్ష్మి తన పుస్తకాలకు తనే ముఖ చిత్రం, లోపలి బొమ్మల చిత్రణ …