అప్పట్లో, ఈనాడు ఆదివారం మొదటి పేజీలో “మాయాలోకం” అనే శీర్షిక కింద వింత మనుషుల కథనాలు వేసేవారు. అందులో ఒకటి: ఒక వ్యక్తికి చదవటమంటే విపరీతమైన ఆసక్తి. పగలనకా, రాత్రనకా చదువుతూనే ఉండేవాడు. ఇష్టాలుండచ్చు కాని, అవి వెర్రిగా ముదిరితే అందర్నీ ఇబ్బందికి గురిచేస్తాయి. ఈయన పుస్తకపఠన పిచ్చిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించి విఫలమైన కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఆయనతో “నువ్విలానే చదివితే నీ కళ్ళు పాడైపోతాయి. అప్పడిక నువ్వు పుస్తకం అంటూ చదవలేవు. అందుకనే చదవటం తగ్గించు, లేకపోతే గుడ్డివాడివైపోతావు” అని భయపెట్టారు. అతను ముందు పెద్దగా పట్టించుకోకపోయినా, రాను రాను ఆ భయం అతనిలో పాతుకుపోయింది. “నిజంగా కళ్ళు పోతేనో?!” అన్న ఊహ అతణ్ణి నిలువనివ్వలేదు. దీపముండగానే ఇళ్ళు చక్కదిద్దుకోవాలన్న పద్ధతిని పాటించేసి, కళ్ళుండగానే బ్రెయిలీ లిపి అభ్యసించేసి అందులో ప్రావీణ్యం సాధించాడు. ఇహ, పగలు …
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
1909వ సంవత్సరం. ఆ ఏడే గురజాడ కన్యాశుల్కం నాటక్ం ద్వితీయ ముద్రణ చేస్తున్నారు. ఒంగోలు మునిసుబ్రమణ్యంకు గురజాడ లేఖ రాస్తూ – ’డి.నరసయ్య అనే మిత్రుడు “పీపుల్స్ ఫ్రెండ్” పత్రిక నడుపుతూ ఉండేవాడు, నెల్లూరీయుడే..ఆయన ఇప్పుడు ఉన్నాడా? ఉంటే ఆయన చిరునామా పంపించు. ఆంగ్లభాషలో ఆయన చాలా గట్టివాడు’ అని ఉత్తరాన్ని ముగించారు. గురజాడ ఈ ఉత్తరాన్ని రాస్తున్న సమయానికి నరసయ్య చనిపోయి సరిగ్గా పదిరోజులయింది. దంపూరు నరసయ్య ఆంగ్లభాషలోనే కాదు..పత్రికా నిర్వహణలోనూ గట్టివాడు. సంపాదకునిగా, విమర్శకుడిగా గుర్తింపు …
రాసిపంపినవారు: విప్లవ్.కె
“చలం ” గురించి కానీ , అతని ( ఆయన / గారు అని నేను అనను. సమీక్షించేటప్పుడు కోర్టులో జడ్జీ అంత నిష్పాక్షికంగా వ్యవహరించాలి కనుక, మర్యాద మొదలెడితే విమర్శ నిఖార్సుగా రాదు కనుక) రచనాశైలి గురించీకానీ, philosophy గురించైనా ఇవ్వాళ నేను రాయడం అంటే ఒకట్రెండు జీవితకాలాల లేటుగా జరుగుతున్న వ్యవహారం. కానీ నేను చదివిన అతని రచనలు కొన్నిటిని గూర్చి సమీక్షలూ, విమర్శలూ గట్రా చదువుదామని మూడునాలుగు సంవత్సరాలుగా గూగుల్లో చూస్తున్నా ఎప్పుడూ ఏవీ కనపడలేదు. కొంచెంలో కొంచెం మైదానం గురించైతే వాడివేడి discussions, arguments జరిగాయ్ తప్పితే. నాకు అర్థం అయినంతలో , అర్థం చేసుకుంటూ చెబుతున్న అర్థాలే ఈ సమీక్షలనీ,
విభేదించేవారు బాహాటంగా తిట్టిచ్చని confess చేస్తూ…మొదటగా ” అమీనా” గురించి:
ఒక్కమాటలో కథ గురించి చెప్పాలీ అంటే, “పన్నెండూపదమూడేళ్ళా బాలికపట్ల …
రాసిన వారు: నిడదవోలు మాలతి
******************
మొదటి భాగం ఇక్కడ.
నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.
మదనాగయూధసమగ్రదేశము గాని
కుటిలవర్తనశేషకులము గాదు.
ఆహవోర్వీజయహరినివాసము గాని
కీశసముత్కరాంకితము గాదు
సుందరస్యందనమందిరంబగు గాని
సంతతమంజులాశ్రయము గాదు
మోహనగణికాసమూహగేయము గాని
యూధికానికరసంయుతము గాదు
సరససత్పుణ్యజననివాసము గాని
కఠిననిర్దయదైత్యసంఘము గాదు
కాదు కాదని కొనియాడఁ దగినట్టి
పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.
“కాదు, కాదం”టూ, ఏది అవునో వివరిస్తున్నానని తానే చెప్పడంలో ఆమె గడుసుదనం చూడగలం. ముందు చెప్పేను ఆమె కవిత్వంలో సంస్కృతసమాసాలు విశేషంగా ఉన్నాయని. అది కూడా పైపద్యంలో గమనించవచ్చు.
అలాగే ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తూ కవితలల్లడంలో సొగసు చూడండి. అరణ్యకాండలో సీతని వెతుకుతూ రాముడు తిరుగుతున్న ఘట్టం -
ఏమృగంబును గన్నఁ …
రాసిన వారు: నిడదవోలు మాలతి
**************************
“కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ లేని కథలు చాలానే ఉన్నాయి. నిజానికి రాధికాస్వాంతనం రాసిన ముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో.
మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, లేదో, అవి దొరుకుతాయో లేదో తెలీదు. కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితులదృష్టిని ఆకర్షించడం విశేషం. తొలిసారిగా నేను గమనించింది -మొల్ల రామాయణంలో 2400 శ్లోకాలు రాసిందని “మానుషి” అన్న ఇంగ్లీషు పత్రికలో చూసినప్పుడు. ఇప్పుడు ఆవాక్యం తొలగించబడింది. ఆతరవాత లలిత, తారూ రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా శ్లోకాలనే వ్యవహరించేరు మొల్ల రామాయణంలో పద్యాలని. అప్పుడే నాకు …